భారతదేశం, ఏప్రిల్ 28 -- Tirupati Akola Weekly Express : ప్రయాణికుల సౌకర్యార్థం దక్షిణ మధ్య రైల్వే (SCR) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నుంచి మహారాష్ట్రలోని అకోలా మధ్య నడుస్తున్న స్పెషల్ రైళ్లను క్రమబద్ధీకరిస్తూ.. వాటిని శాశ్వత వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చింది. ఇందుకు రైల్వే బోర్డు ఆమోదం తెలిపింది. మే మొదటి వారం నుంచి రైలు నంబర్లు 17429/17430 కొత్త టైమ్ టేబుల్‌తో అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త రైలు కేవలం రెండు నగరాలను కలపడమే కాకుండా.. రాయలసీమ, తెలంగాణలోని ప్రధాన పట్టణాలను మహారాష్ట్రలోని కీలక కేంద్రాలతో అనుసంధానిస్తుంది. ముఖ్యంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికి ఈ రైలు పెద్ద ఊరటనివ్వనుంది. అనంతపురం, కర్నూలు, మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా...