భారతదేశం, ఏప్రిల్ 13 -- South Central Railway Train Diversion Updates : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది.విజయవాడ డివిజన్ రాయనపాడు యార్డులో జరుగుతున్న ఆధునీకరణ పనుల నేపథ్యంలో పలు రైళ్లను దారి మళ్లించనుంది. మే 1వ తేదీ నుంచి మే 5వ తేదీ వరకు పలు ప్రధాన రైళ్లను ఇతర మార్గాల్లో మళ్లించనున్నట్లు ప్రకటించింది. ఈ పనుల కారణంగా. విజయవాడ - దువ్వాడ సెక్షన్ లో ప్రయాణించే పలు రైళ్ల రాకపోకలపై కూడా ప్రభావం పడనుంది.

రాయనపాడు వద్ద జరుగుతున్న సాంకేతిక పనుల కారణంగా విశాఖపట్నం, ముంబై, షిరిడీ వంటి నగరాలకు వెళ్లే కీలక రైళ్లను దారి మళ్లిస్తారు. ముఖ్యంగా విజయవాడ - కాజీపేట - పగిడిపల్లి మీదుగా వెళ్లాల్సిన రైళ్లను విజయవాడ - కృష్ణ కెనాల్ - గుంటూరు - పగిడిపల్లి మీదుగా నడపనున్నారు.

దారి మళ్లింపు కారణంగా ఈ రైళ్లు సాధారణ మార్గంలో ఉండే కొన్...