భారతదేశం, ఆగస్టు 25 -- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఈ వారం వరుస సెలవులు రానున్నాయి. మిలాద్-ఉన్-నబీ పండగను పురస్కరించుకుని ఆగస్టు 26న బుధవారం నాడు తెలుగు రాష్ట్రాల్లోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు అధికారికంగా సెలవు ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌లో మిలాద్-ఉన్-నబీ సెలవును మొదట ఆగస్టు 25గా నిర్ణయించినప్పటికీ, ప్రభుత్వం పండగ తేదీని సవరిస్తూ ఆగస్టు 26న అధికారిక సెలవుగా ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆగస్టు 26నే పబ్లిక్ హాలిడేగా నిర్ణయించింది. దీంతో ఆగస్టు 25న సెలవు ఉంటుందని భావించిన విద్యార్థులు, ఉద్యోగులు అప్‌డేట్ చేసిన ఈ షెడ్యూల్‌ను గమనించాలని అధికారులు సూచించారు. బుధవారం రోజున విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలు పూర్తిగా మూసివేసి ఉంటాయి.

మిలాద్-ఉన్-నబీ సెలవు మాత్రమే కాకుండా.. ఆ...