భారతదేశం, మార్చి 18 -- బాలీవుడ్ స్టార్ బ్యూటీ సారా అలీ ఖాన్‌కు బద్రీ-కేదార్ ఆలయ కమిటీ (BKTC) షాకిచ్చింది. ప్రతి ఏటా కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించే సారా, ఇకపై దర్శనం చేసుకోవాలంటే తన విశ్వాసాన్ని నిరూపించుకుంటూ అఫిడవిట్‌పై సంతకం చేయాల్సి ఉంటుంది.

మార్చి 10న జరిగిన బీకేటీసీ సమావేశంలో సనాతన ధర్మంపై విశ్వాసం లేనివారి ప్రవేశాన్ని నిషేధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. హిందువులు కానివారు ఎవరైనా సరే, తమకు హిందూత్వంపై నమ్మకం ఉందని వ్రాతపూర్వక ప్రకటన ఇస్తేనే ఆలయ ప్రాంగణంలోకి అనుమతిస్తారు.

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్ తల్లి అమృతా సింగ్ (సిక్కు), తండ్రి సైఫ్ అలీ ఖాన్ (ముస్లిం) వేరు వేరు మతాలకు చెందిన వాళ్లు. దీంతో సారా అలీ ఖాన్ విషయంలో ఈ కొత్త నిబంధన కూడా అమలు అవుతుంది. ఆమె బద్రీనాథ్ కు వెళ్లాలంటే తప్పనిసరి అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుం...