భారతదేశం, ఆగస్టు 5 -- అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యటనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. ఆగస్టు 22వ తేదీన ఈ జిల్లాలో ఆయన పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన సంజీవని పైలట్ ప్రాజెక్ట్‌ను సీఎం ప్రారంభించనున్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఖరారైన నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లా యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. సీఎం రాక సందర్భంగా చేపట్టాల్సిన వివిధ రకాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ టి.నిశాంతి అధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ, ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (PO) ఆదిత్య వర్మ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) శ్రుతి, జిల్లా రెవెన్యూ అధికారి (DRO) ఎం.వి.ఎస్. లోకేశ్వరరావుతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువ...