భారతదేశం, మార్చి 28 -- బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ 'ధురంధర్: ది రివెంజ్' సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన తన భార్య మాన్యత దత్, పిల్లలు షహ్రాన్, ఇక్రాతో కలిసి ముంబైలోని ఒక రెస్టారెంట్‌కు డిన్నర్ కోసం వెళ్లాడు. అక్కడ ఉన్న ఫొటోగ్రాఫర్లపై సంజయ్ దత్ ఫైర్ అయ్యాడు.

సంజయ్ దత్ కుటుంబం రెస్టారెంట్‌కు చేరుకోగానే ఫోటోగ్రాఫర్లు ఒక్కసారిగా వారిని చుట్టుముట్టారు. కంటిన్యూగా కెమెరాలు క్లిక్ మనిపిస్తూ, నటుడిని పిలుస్తూ ఇబ్బంది పెట్టారు. దీంతో సహనం కోల్పోయిన సంజయ్ దత్, "బస్ కర్నా బే" (ఇక ఆపండి) అంటూ వారిపై విసుక్కున్నాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

డిన్నర్ ముగించుకుని బయటకు వచ్చేటప్పుడు కూడా ప్యాపరాజీలు సంజయ్ దత్ ఫ్యామిలీని వదల్లేదు. కెమెరాలతో వెంబడిస్తుండటంతో.. "అరే భాయ్, రెండు నిమిషాలు ఆపండి. ఇప్పుడు చాలు" అంటూ సంజయ్ దత్ గట్టిగానే వార్...