భారతదేశం, జూలై 31 -- Sandeep Reddy Vanga: "ఇది కేవలం ట్రైలర్ కాదు.. ధర్మం ఎప్పుడూ అధర్మంపై గెలుస్తుందనే సనాతన సత్యాన్ని గుర్తుచేసే శంఖారావం.. ఇది రామయుగం ఆరంభం" అంటూ 'యానిమల్' ఫేమ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపిస్తోంది. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ఎపిక్ విజువల్ వండర్ 'రామాయణం' ట్రైలర్‌ను చూసిన వంగా, తనదైన శైలిలో స్పందిస్తూ మేకర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

సందీప్ రెడ్డి వంగా సాధారణంగా ప్రతీ సినిమాపై కామెంట్లు చేయరు. కేవలం తనకు నిజంగా నచ్చిన, కంటెంట్‌లో దమ్మున్న ప్రాజెక్టుల గురించి మాత్రమే సోషల్ మీడియాలో మాట్లాడతారని అందరికీ తెలిసిందే. 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' లాంటి వరుస ఇండస్ట్రీ హిట్లతో ఇండియన్ సినిమాను ష...