భారతదేశం, జూలై 18 -- Sameera Reddy: బాలీవుడ్ లో నటించిన తొలి మూవీలోనే తాను తీవ్రమైన శరీర రంగు వివక్ష, బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని సీనియర్ నటి సమీరా రెడ్డి సంచలన నిజాలు బయటపెట్టింది. సోహైల్ ఖాన్ హీరోగా వచ్చిన 'మైనే దిల్ తుజ్కో దియా' టైమ్‌లో తన స్కిన్ టోన్ కంటే మూడు షేడ్స్ తక్కువ ఉన్న ఫౌండేషన్ వాడమన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. హీరోయిన్ అంటే కచ్చితంగా తెల్లగా ఉండాలనే రూల్స్ పెట్టడం వల్లే తనకు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పింది.

రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి తన కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఓపెన్ అయింది. తన ఫస్ట్ సినిమా షూటింగ్ టైమ్‌లో ముఖానికి వేసిన తెల్లటి మేకప్‌తో మ్యాచ్ అవ్వడం కోసం బాడీ మొత్తానికి మేకప్ వేసేవారని గుర్తుచేసుకుంది.

ఆ మేకప్ వల్ల తాను స్క్రీన్ మీద దాదాపు గ్రే కలర్‌లో కనిపించేదాన్నని చెప్పింది....