భారతదేశం, ఏప్రిల్ 3 -- విరూపాక్ష సినిమా సక్సెస్ తో డిఫరెంట్ స్టోరీలు ఎంచుకుంటూ ముందుకు సాగిపోతున్నాడు మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్). ప్రస్తుతం 'సంబరాల యేటి గట్టు' మూవీని కంప్లీట్ చేసే పనిలో ఉన్న ఈ యంగ్ హీరో.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ ప్రకటించాడు.

మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ మరో భారీ ప్రాజెక్ట్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు రాబోతున్నాడు. 'క' మూవీ డైరెక్టర్లు సుజీత్, సందీప్ తో కలిసి సాయి దుర్గా తేజ్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా అనౌన్స్ మెంట్ పోస్టర్ ను శుక్రవారం (ఏప్రిల్ 3) రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.

''యుగాల రహస్యం.. ఊహకు అందని శక్తి. నిజంగా ఎంతో శక్తిమంతమైన దాంట్లోకి అడుగుపెడుతున్నా. డైనమిక్ డైరెక్టర్లు సుజీత్, సందీప్ తో పాటు తపన ఉన్న ప్రొడ్యూసర్ సాహు గారపాటితో కలిసి ఈ జర్మీలో భ...