భారతదేశం, మార్చి 24 -- విదేశీ నిధులు పొందేందుకు రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌ (ఆర్డీటీ)కి కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఆర్టీడీ సేవలకు లైన్ క్లియర్ అయింది. ఆర్డీటీ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో దశాబ్ధాల కాలంగా ఎన్నో సేవలు కార్యక్రమాలు చేపడుతోంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలోని పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తూ వస్తోంది.

ఈ సంస్థకు విదేశాల నుంచి నిధులు అందుతాయి. అయితే విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన అనుమతులను ఎఫ్‌సీఆర్‌ఏ (Foreign Contribution Regulation Act కింద నిలిపివేస్తూ ఏడాది క్రితం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. దీంతో ఫారిన్‌ కాంట్రిబ్యూషన్‌ ఖాతాల్లో ఉన్న నిధులను వినియోగించడానికి బ్రేక్ పడింది. విద్య, వైద్యం, స్వయం ఉపాధి కార్యక్రమాల అమలుకు అంతరాయం కలిగింది.

ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని సంస్థ ప...