భారతదేశం, ఆగస్టు 16 -- రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్రముఖ 'కాంటినెంటల్ జీటీ 650' బైక్​కి అదిరిపోయే అప్‌డేట్లను తీసుకువచ్చింది. ఈ సరికొత్త బైక్ నాలుగు ఆకర్షణీయమైన రంగుల ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 3,58,427 నుంచి మొదలవుతుంది. ఈ అప్‌డేటెడ్ మోడల్‌లో గమనించదగ్గ మార్పు ఏంటంటే.. ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ చుట్టూ నల్లటి పెయింట్​తో కూడిన కౌల్ ఇచ్చారు. దీనివల్ల డ్యాష్‌బోర్డ్ లుక్ మరింత స్టైలిష్‌గా కనిపిస్తుంది. అలాగే ఇందులో కొత్త ఎల్ఈడీ ఇండికేటర్లతో పాటు యూఎస్బీ టైప్-సీ ఫాస్ట్-చార్జింగ్ పోర్ట్‌ను కూడా చేర్చారు.

ఆగస్టు 14, 2026 నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లలో ఈ కొత్త బైక్ కొనుగోలుకు అందుబాటులో ఉంది.

ఈ 2026 కాంటినెంటల్ జీటీ 650 నాలుగు విభిన్న రంగుల్లో లభిస్తుంది. ప్రతి వేరియంట్ ధర, వాటి ప్రత్యేకత...