భారతదేశం, జూలై 17 -- టీమిండియా మాజీ కెప్టెన్, హిట్​మ్యాన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగింపునకు వచ్చినట్లు గత కొన్ని గంటలుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. టెస్టులు, టీ20లకు ఇప్పటికే గుడ్​బై చెప్పిన రోహిత్​కు.. ఇంగ్లాండ్‌తో లార్డ్స్ వేదికగా ఆదివారం (జులై 19) జరగబోయే మూడో వన్డేనే ఆఖరి మ్యాచ్ కానుందని కథనాలు వస్తున్నాయి. భవిష్యత్తు ప్రణాళికల్లో భాగంగా సెలక్టర్లు యువ ఆటగాళ్లకు మొగ్గు చూపుతున్నట్లు ఒక జాతీయ మీడియా సంస్థ ప్రచురించిన కథనంతో ఇప్పుడు రోహిత్​ శర్మ రిటైర్మెంట్​ వార్త ట్రెండింగ్​లోకి వచ్చింది.

గత కొంతకాలంగా రోహిత్ శర్మ మునుపటి ఆటతీరును ప్రదర్శించలేకపోతున్నారు. కార్డిఫ్‌లోని సోఫియా గార్డెన్స్‌లో గురువారం జరిగిన రెండో వన్డేలో రోహిత్ తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఏకంగా 47 బంతులు ఆడిన అతను కేవలం 26 పరుగులు మాత్రమే చేయగలిగారు. అం...