భారతదేశం, జూన్ 26 -- మీరు నిత్యం రాత్రి వేళల్లో వాహనాలు నడుపుతుంటారా? అయితే మీరు జాగ్రత్తగా ఉండాలని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. భారతదేశంలో రాత్రి 9 గంటల నుంచి 10 గంటల మధ్య సమయం.. డ్రైవింగ్ చేయడానికి రోజులోనే అత్యంత ప్రమాదకరమైన సమయమని ఒక సమగ్ర అధ్యయనం వెల్లడించింది. జునో జనరల్ ఇన్సూరెన్స్ విడుదల చేసిన 'ఇండియా రోడ్ సేఫ్టీ రిపోర్ట్ (ఐఆర్​ఎస్​ఆర్) 2026' ప్రకారం.. రాత్రి 8 గంటల తర్వాత వాహనదారుల డ్రైవింగ్ స్కోర్లు వేగంగా పడిపోతున్నాయి. దీనివల్ల మధ్యాహ్న సమయంతో పోలిస్తే రాత్రి వేళల్లో ప్రయాణాల రిస్క్ బాగా పెరుగుతోంది. అదే సమయంలో, రోడ్లపై ప్రయాణించడానికి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య సమయం అత్యంత సురక్షితమైనదని ఈ నివేదిక పేర్కొంది.

జునో స్మార్ట్‌డ్రైవ్ యాప్ ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. దేశంలోని 17 రాష్ట్రాల్లో దాదా...