భారతదేశం, మే 2 -- Riteish Deshmukh: ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన 'రాజా శివాజీ' చిత్రం మే 1న థియేటర్లలో విడుదలై అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించిన ప్రముఖ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు. అదే సమయంలో ఆయన సినిమాకు సంబంధించి ఒక రిక్వెస్ట్ కూడా చేశాడు.

రాజా శివాజీ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రితేష్ దేశ్‌ముఖ్.. ఆడియన్స్ ను ఓ రిక్వెస్ట్ చేశాడు. ఎవరూ థియేటర్లలోని దృశ్యాలను వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కోరాడు. ఈ మేరకు రితేష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రత్యేకంగా ఒక వీడియోను పంచుకున్నాడు.

"నమస్కారం! ఛత్రపతి శివాజీ మహారాజ్ కథ ఆధారంగా 'రాజా శివాజీ' చిత్రాన్ని మేము విడుదల చేశాం. మీరు ఈ సినిమాను స్వయంగా వీక్షి...