భారతదేశం, సెప్టెంబర్ 13 -- Renu Desai OTT: పవన్ కళ్యాణ్ సరసన 'బద్రి', 'జానీ' వంటి చిత్రాలలో నటించి మెప్పించిన రేణు దేశాయ్ ఇప్పుడు ఓటీటీ ఎంట్రీ ఇచ్చారు. 2023లో వచ్చిన 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రంలో హేమలతా లవణం పాత్రలో కనిపించిన ఆమె, దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఈటీవీ విన్ (ETV Win) ఓటీటీ ద్వారా ఆడియన్స్ కు కనిపించారు.

రేణు దేశాయ్ లీడ్ రోల్ ప్లే చేసిన 'కాశీ మజిలీ' అనే చిన్న చిత్రం ఇవాళ (సెప్టెంబర్ 13) డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేసింది. యమునా కిషోర్ దర్శకత్వంలో జెకే ఆర్ట్స్ పతాకంపై జగదీష్ కుమార్ కల్లూరు నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈటీవీ విన్ 'కథా సుధ' సిరీస్‌లో భాగంగా నేరుగా డిజిటల్ డెబ్యూ చేసింది.

మూడేళ్ల విరామం తర్వాత రేణు దేశాయ్ ఓ సినిమాలో యాక్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైమ్. అయితే కాశీ మజిలీ మూవీలో ఆమె కేవలం ఓ కీలక ప...