భారతదేశం, మార్చి 5 -- హైదరాబాద్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ పేరుతో కొందరు కోట్లు దండుకున్నారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అపార్ట్‌మెంట్ నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేశారు. కస్టమర్లను నమ్మించి.. భారీగా డబ్బులు వసూలు చేశారు.

త్రిపుర కన్స్ట్రక్షన్స్ వ్యవస్థాపకులు, డైరెక్టర్లపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో కొంతమంది వ్యక్తులను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ డైరెక్టర్ పసుపులేటి సుధాకర్‌‌తోపాటుగా ఆయన భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు.

త్రిపుర కన్స్ట్రక్షన్ సంస్థ గత కొన్ని ఏళ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ ప్రారంభిస్తున్నట్టుగా ప్రచారం చేసిందని పోలీసులు తెలిపారు. కస్టమర్లను ఆకర్శించడానికి అనేక రకాల ప్రకటనలు విడుదల చేశారు. తక్కువ ధరలో ఫ్లాట్ల...