భారతదేశం, మార్చి 28 -- ఐపీఎల్ 2026 సీజన్ ఇవాళ (మార్చి 28) ప్రారంభమైంది. ఐపీఎల్ తొలి రోజున సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్స్ పోడీ పడనున్నాయి. ఈపాటికే ఐపీఎల్ తొలి మ్యాచ్ ప్రారంభమైపోయింది. ఈ సందర్భంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఒక విషాద జ్ఞాపకంతో నిశ్శబ్దమైంది.

డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న ఈ పోరులో ఆర్‌సీబీ యాజమాన్యం తమ అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటుకుంటూ ఎంతో భావోద్వేగపూరిత నిర్ణయం తీసుకుంది.

గత ఏడాది జూన్ 4న ఆర్‌సీబీ తొలిసారి టైటిల్ గెలిచిన సంబరాల్లో జరిగిన తొక్కిసలాటలో ఒక చిన్నారితో సహా 11 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ 11 ప్రాణాలకు గుర్తుగా ఈ మ్యాచ్‌లో ఆటగాళ్లు నల్ల రిబ్బన్లు ధరించి నివాళులు అర్పించారు.

గత ఏడాది జరిగిన ఆ దుర్ఘటనను గుర...