భారతదేశం, మార్చి 20 -- ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్​) 2026 సందడి మొదలైంది. గత సీజన్‌లో మొట్టమొదటి టైటిల్‌ను గెలుచుకుని, డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ).. తమ హోమ్ మ్యాచ్‌ల కోసం టిక్కెట్ల విక్రయానికి సంబంధించి మార్గదర్శకాలను తాజాగా ప్రకటించింది. టిక్కెట్ల అమ్మకాలు ఇంకా అధికారికంగా ప్రారంభం కానప్పటికీ, అభిమానులు ముందస్తుగా సిద్ధం కావడానికి అవసరమైన స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్, కీలక నిబంధనలను ఫ్రాంచైజీ వివరించింది.

ఈ ఐపీఎల్​లో ఆర్సీబీ టిక్కెట్ల కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు, రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు తన అధికారిక ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొన్ని ముఖ్యమైన సూచనలను ప్రకటించింది. కేవలం గుర్తింపు పొందిన, అధికారిక ఛానెళ్ల ద్వారా మాత్రమే టిక్కెట్లు కొనుగోలు చేయాలని అభిమానులను కోరింది. నకిలీ వెబ్‌సైట్...