భారతదేశం, మార్చి 28 -- ఒకప్పుడు ఉత్తరప్రదేశ్‌లో షూటింగులకు వెళ్లాలంటే హీరోయిన్లు భయపడేవారని.. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని టాలీవుడ్ విలన్, గోరఖ్ పూర్ ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు. ఇటీవల గోరఖ్‌పూర్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్న ఒక కార్యక్రమంలో రవి కిషన్ ప్రసంగిస్తూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

వేదికపై నటుడు, ఎంపీ రవి కిషన్ మాట్లాడుతూ.. "ఉత్తరప్రదేశ్‌కు ఇప్పుడు జయజయధ్వానాలు వినిపిస్తున్నాయి. గతంలో యూపీ అంటేనే వద్దనేవారు. అక్కడ కాల్పులు జరుగుతాయని, షూటింగులకు రామని హీరోయిన్లు అనేవారు. కానీ, తాజాగా మాధురి దీక్షిత్ గారు ఇక్కడికి వచ్చి మూడు రోజుల పాటు గోరఖ్‌పూర్‌లో ఉండి వెళ్లారు. ఆమె ఇక్కడ ఎంతో సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండి ముంబైకి తిరిగి వెళ్లారు" అని తెలిపారు.

అంతేకాకుండా, మాధురీ దీక్షిత్‌ను కలవడానికి వచ్చ...