భారతదేశం, సెప్టెంబర్ 13 -- Rashmika Mandanna: టాలీవుడ్‌లో అత్యంత క్రేజీ జోడీగా పేరుపొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్‌లో వస్తున్న భారీ పీరియడ్ డ్రామా 'రణబలి' (Ranabaali) కీలక దశకు చేరుకుంది. ఈ చిత్రంలో 'జయమ్మ' అనే ఒక పవర్‌ఫుల్ అండ్ ఎమోషనల్ పాత్రను పోషిస్తున్న రష్మిక మందన్న, తన పాత్రకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసుకున్నారు.

రణబాలి మూవీ షూటింగ్ లో జయమ్మ జర్మీ ముగిసింది. జయమ్మ క్యారెక్టర్లో ప్రెగ్నెంట్ గా కనిపించిన రష్మిక మందన్న గుడ్ బై చెప్పేసింది. ఈ సందర్భంగా చిత్ర బృందం సెట్స్‌లో రష్మికకు ఘనంగా వీడ్కోలు పలికింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సంకృత్యాన్, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ రష్మికతో ఉన్న అనుబంధాన్ని చాటుతూ ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో విడ...