భారతదేశం, ఏప్రిల్ 10 -- టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల ఇంట ఇప్పుడు పండగ వాతావరణం నెలకొంది. ఏప్రిల్ 5న రష్మిక మందన్నా తన 30వ పుట్టినరోజును ఎంతో వైభవంగా జరుపుకున్నారు. ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన రష్మిక మందన్నాకు పెళ్లి తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు ఇది. దీంతో ఈ వేడుకను మరింత ప్రత్యేకంగా ప్లాన్ చేశారు.

రష్మిక స్వస్థలమైన కూర్గ్ (కొడగు)లో జరిగిన ఆమె బర్త్ డే వేడుకల్లో ఇరు కుటుంబ సభ్యులు సందడి చేశారు. పుట్టినరోజు సందర్భంగా రష్మిక తన భర్త విజయ్‌తో కలిసి పాడి శ్రీ ఇగ్గుతప్ప ఆలయాన్ని సందర్శించారు. కొడవ సంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న రష్మిక ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, తమ గ్రామంలోని ప్రజలకు అన్నదానం చేయడం, విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ప్రకటించడం ద్వారా ఈ జంట తమ ఉద...