భారతదేశం, ఫిబ్రవరి 28 -- ఇండియా డొమెస్టిక్ క్రికెట్లో సంచలనం. 69 ఏళ్ల తమ రంజీ ట్రోఫీ ప్రయాణంలో జమ్ము కశ్మీర్ మొట్టమొదటి సారి ఛాంపియన్ గా నిలిచింది. రంజీ ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది. శనివారం (ఫిబ్రవరి 28) రంజీ ట్రోఫీ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో జమ్ము కశ్మీర్ కొత్త చరిత్ర లిఖించింది. భారత దేశవాళీ క్రికెట్లో తన ప్రస్థానాన్ని ఘనంగా చాటింది.

1959లో జమ్ము కశ్మీర్ తొలిసారి రంజీ ట్రోఫీలో ఆడింది. అప్పటి నుంచి టైటిల్ వేట కొనసాగిస్తూనే ఉంది. ఇప్పుడు 69 ఏళ్ల తర్వాత ఆ టీమ్ కల నెరవేరింది. ఇవాళ ఫైనల్లో కర్ణాటకపై విజయంతో తొలిసారి రంజీ ట్రోఫీని సగర్వంగా అందుకుంది. భారత క్రికెట్ చరిత్రలో ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు అని చెప్పొచ్చు.

రంజీ ట్రోఫీ 2026 ఫైనల్లో జమ్ము కశ్మీర్ అద్భుతమైన ఆటతీరు ప్రదర్శించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సార్లు రంజీ ట్రోఫీ ఛ...