భారతదేశం, మార్చి 9 -- హిందీ ప్రముఖ డైరెక్టర్ నితీష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'రామాయణం' గురించి రోజుకో వార్త నెట్టింట హల్‌చల్ చేస్తోంది. తాజాగా శనివారం (మార్చి 7) నాడు రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడుగా, సాయి పల్లవి సీతాదేవి వేషధారణలో ఉన్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.

రాజసం ఉట్టిపడేలా కిరీటం, నగలు ధరించి ఉన్న ఈ లీక్‌డ్ ఫోటోలు చూసి.. సినిమాలోని రాముడు, సీత పెళ్లి వేడుకకు సంబంధించినవేనని అంతా భావించారు. అయితే, ఈ ఫోటోలు అసలైనవి కావు, ఏఐ (AI) సృష్టించిన నకిలీ ఫోటోలని తాజాగా తేలిపోయింది.

సాధారణంగా సెట్స్ నుంచి లీక్ అయ్యే ఫోటోలు కాస్త అస్పష్టంగా ఉంటాయి. కానీ, ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు అత్యంత స్పష్టంగా (HD Quality) ఉండటంతో నెటిజన్లకు అనుమానం వచ్చింది. దీనిపై కొందరు ఆరా తీయగా, 'గ్రోక్' (Grok) చా...