భారతదేశం, ఏప్రిల్ 8 -- Ramayana: ఇండియన్ సినిమా హిస్టరీలో అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా తెరకెక్కుతున్న 'రామాయణం'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణబీర్ కపూర్ (రాముడు), సాయి పల్లవి (సీత), యష్ (రావణుడు) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దర్శకుడు నితీష్ తివారీ ఎలా ఆవిష్కరించబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నితీష్.. రావణుడి పాత్ర చిత్రణపై సంచలన విషయాలను పంచుకున్నాడు. రావణుడిని కేవలం ఒక విలన్ గానే కాకుండా, అతనిలోని భిన్న కోణాలను ప్రపంచానికి చూపించబోతున్నట్లు అతడు స్పష్టం చేశాడు.

రావణుడిని ఒక సాధారణ విలన్ తరహాలో కాకుండా, అతని మేధస్సును, భక్తిని చూపిస్తారా? అని అడిగిన ప్రశ్నకు నితీష్ ఆసక్తికరంగా స్పందించాడు. "రావణుడి జీవితంలో చాలా కోణాలు ఉన్నాయి. అతను గొప్ప యోధుడు, నిష్ణాతుడైన సంగీత విద్వాంసుడు, గొప్...