భారతదేశం, జూలై 14 -- Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ విరాళాల వివాదంపై బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అనుపమ్ ఖేర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆలయ డొనేషన్ బాక్సుల్లో జరిగిన అక్రమాలను "చాలా చిన్న విషయం" అని ఆయన అభివర్ణించడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతున్నా ఆయన మాత్రం తన అభిప్రాయం మార్చుకునే ప్రసక్తే లేదని చాలా ఖరాఖండిగా తేల్చి చెప్పారు.

ప్రస్తుతం అనుపమ్ ఖేర్ అయోధ్య పరిసర ప్రాంతాల్లో తన అప్‌కమింగ్ మూవీ 'శ్రీరామ భూమి' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ టైమ్‌లోనే రామ్ మందిర్ ట్రస్ట్‌లో విరాళాల లెక్కింపులో కొన్ని అక్రమాలు జరిగాయనే వార్తలు బయటకు వచ్చాయి. దీనిపై ఇండియా టుడే ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుపమ్ ఖేర్.. దొంగతనం ఎక్కడ జరిగినా తప్పేనని, అయితే దీన్ని మతపరమైన...