భారతదేశం, మార్చి 14 -- సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) తన కెరీర్ లోనే అత్యంత విజయవంతమైన పొలిటికల్ క్రైమ్ డ్రామా సిరీస్ 'సర్కార్' (Sarkar)కి మరో భాగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ముంబైలో జరుగుతున్న 'రెడ్ లారీ ఫిల్మ్ ఫెస్టివల్' (Red Lorry Film Festival) ప్రారంభ వేడుకల్లో పాల్గొన్న వర్మ.. 'సర్కార్ 4' సినిమాను అధికారికంగా అనౌన్స్ చేశాడు. వచ్చే నెల (ఏప్రిల్ 2026) నుండే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నట్లు అతడు వెల్లడించాడు.

ఈ సిరీస్ లోని మొదటి మూడు భాగాల్లో సుభాష్ నాగ్రే పాత్రలో అమితాబ్ బచ్చన్ అలరించగా.. అతని కుమారుడిగా శంకర్ నాగ్రే పాత్రలో అభిషేక్ బచ్చన్ నటించాడు. తాజా సమాచారం ప్రకారం, 'సర్కార్ 4'లో ఈ తండ్రీకొడుకుల జోడీ మళ్ళీ మ్యాజిక్ చేయబోతోంది.

మహారాష్ట్ర రాజకీయాల నేపథ్యంలో ఈ సర్కార్ 4 సాగనుంది. గత సినిమాల కంటే భిన్నంగా, ప్రస్తుత మహారాష...