భారతదేశం, జూలై 31 -- Ram Charan Jr NTR: టాలీవుడ్ టాప్ హీరోలు కేవలం సినిమాల్లో నటిస్తూ రెమ్యునరేషన్ తీసుకోవడమే కాకుండా, బిజినెస్ రంగాన్ని కూడా శాసించేలా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ బిజినెస్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు తెచ్చిన ట్రెండ్ ఇప్పుడు టాలీవుడ్‌ను ఊపేస్తోంది. ఈ క్రమంలోనే గ్లోబల్ స్టార్స్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా హైదరాబాద్‌లో సొంత మల్టీప్లెక్స్ థియేటర్ల నిర్మాణం వైపు దృష్టి పెట్టినట్లు ఫిలిం నగర్‌లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

సౌత్ ఇండియాలోనే అతిపెద్ద థియేటర్ చైన్‌లలో ఒకటైన ఏషియన్ సినిమాస్ (Asian Cinemas) అధినేత సునీల్ నారంగ్ భాగస్వామ్యంతో ఇప్పటికే మహేష్ బాబు, అల్లు అర్జున్ సంచలనాలు సృష్టించారు. ఇప్పుడు ఇదే బాటలో రామ్ చరణ్ కూడా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త...