భారతదేశం, మార్చి 25 -- గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు గాయమైందన్న వార్త నిన్నటి నుంచి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' షూటింగ్‌లో చరణ్ గాయపడ్డాడు. మంగళవారం (మార్చి 24) ఈ న్యూస్ బయటకు రాగానే.. అతని కంటికి తీవ్ర గాయమైందని పుకార్లు షికార్లు చేయడంతో మెగా అభిమానులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. కానీ చరణ్ టీమ్ ఈ వార్తలపై వెంటనే స్పందించి అసలు నిజం ఏంటో హిందుస్థాన్ టైమ్స్‌కు క్లారిటీ ఇచ్చింది.

యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా రామ్ చరణ్ కంటికి కాదు, కంటి పైభాగంలో చిన్న గాయమైందని అతని టీమ్ నుంచి ఒకరు స్పష్టం చేశారు. "మంగళవారం ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నప్పుడు చరణ్‌కు గాయమైంది. దానికి ఏకంగా నాలుగు కుట్లు వేయాల్సి వచ్చింది. అయితే జనాలు కంగారు పడుతున్నట్లు ఆయన కంటికి ఏమీ కాలేదు, ...