భారతదేశం, మే 28 -- Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'పెద్ది' (Peddi) జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఢిల్లీలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ని కలిసినప్పుడు 'పెద్ది' సినిమా గురించి జరిగిన సంభాషణను, దానికి సంబంధించిన ఒక రియల్ లైఫ్ స్ఫూర్తిదాయకమైన కథను చరణ్ ఈ వేదికపై వివరించారు.

ఢిల్లీ ప్రెస్ మీట్‌లో రామ్ చరణ్ మాట్లాడుతూ.. "నేను ఢిల్లీలో మోదీ సార్‌ని కలిసినప్పుడు, ఆయన నన్ను 'పెద్ది' సినిమా కథేంటి? దేని గురించి అని అడిగారు. ఈ సినిమా 'వికసిత్ భారత్' (Viksit Bharat), అంటే గ్రామీణ ప్రాంతాల సాధికారత, పల్లెల అభివృద్ధి చుట్టూ తిరుగుతుందని చెప్పా...