భారతదేశం, సెప్టెంబర్ 8 -- Rajesh Sharma: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ 'ఫౌజీ' (Fauzi) షూటింగ్ సెట్‌లో విలక్షణ నటుడు రాజేష్ శర్మకు విష పురుగు కుట్టి ఆసుపత్రి పాలయ్యారంటూ ఇటీవల వైరల్ అయిన వార్తలపై ఆయన స్వయంగా స్పందించారు. హైదరాబాదులోని రామోజీ ఫిలిం సిటీ షూటింగ్ సెట్‌లో తనకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, విష పురుగు కుట్టడం వల్లే ఆసుపత్రిలో చేరాననే వార్తల్లో ఎటువంటి నిజం లేదని క్లారిటీ ఇచ్చారు.

ఇటీవల ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో రాజేష్ శర్మ తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరంగా పంచుకున్నారు. తను చాలా కాలంగా కుడి కాలికైన తీవ్రమైన చర్మ సమస్యతో (Skin Infection) బాధపడుతున్నట్లు తెలిపారు.

ఆ సమయంలో తనకు షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉండటం, దాన్ని ప్రారంభంలో సరైన విధంగా పట్టించుకోకపోవడం వల్లే ఇన్ఫెక్షన్ కాస్త తీవ్రరూపం దాల...