భారతదేశం, మార్చి 21 -- బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టిస్తున్న 'ధురంధర్ 2: ది రివెంజ్' చిత్రానికి స్పెషల్ గుర్తింపు దక్కింది. భారతీయ సినిమా గమనాన్ని మార్చిన దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ఈ మూవీపై ప్రశంసల జల్లు కురిపించాడు. సినిమా స్థాయి, రచన, అందులోని భావోద్వేగ లోతును ఆయన ప్రత్యేకంగా కొనియాడాడు.

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధురంధర్ 2పై రాజమౌళి ప్రశంసలు కురిపించాడు. సోషల్ మీడియాలో సుదీర్ఘమైన రివ్యూ పంచుకున్నాడు. "నేను ధురంధర్-1 ను ఎంతగానో ప్రేమించాను, కానీ 'ది రివెంజ్' దాని స్థాయి, ఆత్మ రెండింటిలోనూ అసలు సినిమాను మించిపోయింది" అని రాజమౌళి రాసుకొచ్చాడు.

''సినిమా సాంకేతిక అంశాలు, నటీనటుల ఎంపిక, ప్రపంచ స్థాయి రూపకల్పనలో ఎలాంటి లోపం లేదు. నాలుగు గంటల సుదీర్ఘ నిడివి గల సినిమాను తీయడానికి గట్స్ ఉండాలి. డైరెక్టర్ ఆదిత్య ధర్ అదరగొట్టాడు. లాస...