భారతదేశం, ఆగస్టు 10 -- రాజమహేంద్రవరంలో ఇటీవల చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈ విషాదకర ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వం తరఫున రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. కష్టకాలంలో ఉన్న ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాజమహేంద్రవరంలోని ఒక షాపింగ్ మాల్ బయట గురువారం రోజు ఈ ఘోర ప్రమాదం జరిగింది. పీజీ మెడికల్ విద్యార్థులైన ప్రియాంక, ఉమేష్‌ ఇద్దరూ కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా, మద్యం మత్తులో వేగంగా వచ్చిన ఒక కారు వీరి ద్విచక్రవాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రియాంక తలకు తీవ్రమైన గాయం కాగా.. ఉమేష్...