భారతదేశం, జూన్ 11 -- ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించే తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన కాచిగూడ - శ్రీగంగానగర్ ట్రైన్ సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు ఈ రూట్‌లో సేవలు అందుకోవచ్చు. ఉత్తరభారతం వైపు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ సర్వీసులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. రైలు నెంబర్ 07053/07054తో నడిచిన స్పెషల్ రైళ్లను సౌత్ సెంట్రల్ రైల్వే పొడిగించింది. ఈ కొత్త సర్వీసులు జూలై నెలలో నడవనున్నాయి.

ట్రైన్ నంబర్ 07053 (కాచిగూడ - శ్రీగంగానగర్) ఈ రైలు జూలైలో రెండు సర్వీసులు నడవనుంది. 11.07.2026 రోజున శనివారం కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. మరో ట్రైన్ 18.07.2026న కాచిగూడ నుంచి వెళ్తుంది.

ఇక ట్రైన్ నంబర్ 07054 (శ్రీగంగానగర్ - కా...