భారతదేశం, ఫిబ్రవరి 24 -- పార్శిల్ సేవలను ఆధునీకరించే ప్రయత్నంలో భాగంగా డోర్ టు డోర్ పార్శిల్ బుకింగ్, డెలివరీని సజావుగా అందించడానికి దక్షిణ మధ్య రైల్వే(SCR) మొట్టమొదటిసారిగా రైల్ పార్శిల్ యాప్‌ను ప్రారంభించనుంది. ఈ యాప్‌ను ఫిబ్రవరి 25న సికింద్రాబాద్‌లోని రైల్ నిలయం ఆడిటోరియంలో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ ప్రారంభించనున్నారు.

ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్న భారత రైల్వేలలో హైదరాబాద్ డివిజన్ మొదటిది అవుతుంది. ఈ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ఫస్ట్ మైల్ (పికప్), మిడ్ మైల్ (రైలు రవాణా), లాస్ట్ మైల్(డెలివరీ)లను కనెక్ట్ చేస్తుంది. పార్శిల్ ట్రాకింగ్‌ను సులభతరం చేస్తుంది. వేగంగా, మరింత పారదర్శకంగా చేస్తుంది.

నెక్ట్స్ జనరేషన్ యాప్ బుకింగ్, ట్రాకింగ్, కన్సైన్‌మెంట్‌లను నిర్వహించడానికి వన్ స్టాప్ ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడుతుంది. ఇది ...