భారతదేశం, ఆగస్టు 12 -- Radhika Sarathkumar: తల్లి కన్నుమూశారనే గుండెకోత వార్త తెలిసిన కొన్ని నిమిషాల్లోనే, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్ సెట్‌లో కామెడీ సీన్ షూటింగ్ పూర్తి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. వర్సటైల్ హీరో సూర్య, డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' ప్రమోషనల్ షూట్‌లో ఈ దిగ్భ్రాంతికర సంఘటన బయటపడింది. సినిమా పట్ల ఆమెకున్న అంకితభావం చూసి ఇండస్ట్రీ ప్రముఖులు సైతం హాట్ టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు.

ఈ షాకింగ్ సంఘటన గురించి దర్శకుడు వెంకీ అట్లూరి ఇటీవల ఓ ప్రమోషనల్ వీడియోలో రివీల్ చేశారు. "మేము సెట్‌లో ఫుల్ కామెడీ సీన్ షూట్ చేస్తున్నాం. సరిగ్గా అదే టైమ్‌లో రాధికా మేడమ్ మదర్ గీతా రాధ గారు చనిపోయారనే బ్యాడ్ న్యూస్ వచ్చింది. ఆ వార్త వినగానే నేను పూర్తిగా బ్లాంక్ అయిపోయాను. కానీ ఆమె మాత్రం మిగిలిన షాట్స్ పూర్తి ...