భారతదేశం, ఏప్రిల్ 14 -- భారతీయ సంగీత సామ్రాజ్యపు ఒక అద్భుతమైన స్వరం మూగబోయింది. తన మధుర గానంతో ఎనిమిది దశాబ్దాల పాటు అలరించిన లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్ ఆశా భోంస్లే ఇకలేరు. గత కొన్ని రోజులుగా నీరసం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్న ఆమె ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్ 12న తుదిశ్వాస విడిచారు. 1933లో సంగీత కుటుంబంలో జన్మించిన ఆశా, కేవలం తొమ్మిదేళ్ల ప్రాయంలోనే గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించి, భారతీయ చలనచిత్ర సంగీతానికి ఒక బలమైన పిల్లర్‌లా నిలిచారు.

హిందీ సినిమా అంటే ఆశా భోంస్లే పాట ఉండాల్సిందే అనే స్థాయికి ఆమె ఎదిగారు. దాదాపు 12,000కు పైగా పాటలను వివిధ భారతీయ భాషల్లో ఆలపించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లోనూ చోటు సంపాదించుకున్నారు. కేవలం మెలోడీలే కాకుండా, క్లాసికల్, పాప్, గజల్స్ ఇలా ప్రతి జానర్‌లో...