భారతదేశం, మే 15 -- ప్రపంచ సాహితీ దిగ్గజం, 'వార్ అండ్ పీస్' (War and Peace) వంటి అద్భుత కావ్యాలను అందించిన లియో టాల్‌స్టాయ్ కేవలం ఒక రచయిత మాత్రమే కాదు, గొప్ప నైతికవాది. మనిషి పుట్టుకకు సార్థకత కేవలం వ్యక్తిగత సంపాదనలోనో లేదా హోదాలోనో లేదని.. అది సాటి మనిషికి చేసే సేవలోనే ఉందని ఆయన బలంగా నమ్మారు. భారతీయ సంస్కృతిలో "పరోపకారార్థం ఇదం శరీరం" అని ఎలాగైతే చెబుతామో, టాల్‌స్టాయ్ భావజాలం కూడా సరిగ్గా అదే బాటలో సాగుతుంది. మహాత్మా గాంధీ వంటి మహనీయులనే ప్రభావితం చేసిన ఆయన చింతన, నేటి పోటీ ప్రపంచంలో మనల్ని మనం సరిచూసుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తోంది.

"ప్రతి పురుషుడు, స్త్రీ యొక్క ప్రాథమిక విధి ఇతరులకు సేవ చేయడమే" అని లియో టాల్‌స్టాయ్ పేర్కొన్నారు. ఆయన రాసిన 'వాట్ షల్ వి డూ?' (What Shall We Do?) అనే ప్రసిద్ధ గ్రంథంలో ఈ విషయాన్ని సుదీర్ఘంగా చర్చించారు....