భారతదేశం, ఏప్రిల్ 25 -- భారతీయ చలనచిత్ర సంగీతంలో తన గొంతుతో ఒక శకాన్ని సృష్టించిన గాయకుడు అరిజిత్ సింగ్. నేడు (ఏప్రిల్ 25) ఆయన పుట్టినరోజు. 'తుమ్ హీ హో' నుంచి మొన్నటి 'కేసరియా' వరకు ఆయన పాడిన ప్రతి పాట ఒక సంచలనం. అయితే, కేవలం వెండితెరపై వినిపించే గొంతుగానే కాకుండా, ఇండస్ట్రీలో తెరవెనుక జరిగే అన్యాయాలపై గొంతెత్తే ధైర్యవంతుడిగా కూడా అరిజిత్ సింగ్‌కు పేరుంది. ఇటీవల ప్లేబ్యాక్ సింగింగ్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరినీ షాక్‌కు గురిచేసిన అరిజిత్, గతంలో సంగీత పరిశ్రమలోని చీకటి కోణాలను వివరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంగీత ప్రియుల్లో చర్చనీయాంశంగా మారాయి.

డిసెంబర్ 2023లో జరిగిన ఒక పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో అరిజిత్ సింగ్ మ్యూజిక్ ఇండస్ట్రీలోని ఆర్థిక అసమానతలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుల్లో ఒకరైనప...