భారతదేశం, ఏప్రిల్ 6 -- వారాంతంలో పలు ప్రముఖ బ్యాంకులు విడుదల చేసిన నాలుగో త్రైమాసిక (Q4FY26) వ్యాపార గణాంకాల ప్రభావం సోమవారం నాటి స్టాక్ మార్కెట్‌పై స్పష్టంగా కనిపించింది. బ్యాంకింగ్ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున అమ్మకాలకు మొగ్గు చూపడంతో ఈ రంగ షేర్లు భారీగా నష్టపోయాయి. నిఫ్టీ బ్యాంక్ సూచీ దాదాపు 0.9 శాతం వరకు క్షీణించింది. ఈ సూచీలోని మొత్తం 14 బ్యాంకుల్లో 9 బ్యాంకుల షేర్లు నష్టాల బాటలోనే నడిచాయి.

ప్రధానంగా కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొని, రెండు శాతానికి పైగా పతనమయ్యాయి. వీటి బాటలోనే ఐసీఐసీఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు కూడా ఒక శాతానికి పైగా నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, యెస్ బ్యాంక్ షేర్లు కూడా నష్టాల్లోనే ట్రేడయ్య...