భారతదేశం, మార్చి 31 -- అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ నటి ప్రియాంక చోప్రా తన మూలాలను అస్సలు మర్చిపోలేదని మరోసారి నిరూపించుకుంది. మంగళవారం (మార్చి 31) ఆమె పంజాబ్‌లోని అమృతసర్‌లో ఉన్న ప్రసిద్ధ హర్మందిర్ సాహిబ్ (గోల్డెన్ టెంపుల్)ను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

గోల్డెన్ టెంపుల్ సందర్శనలో వారణాసి హీరోయిన్ ప్రియాంకా చోప్రా అత్యంత సాధారణంగా కనిపించింది. పీచ్ కలర్ డ్రెస్ ధరించి, తలపై దుపట్టా వేసుకుని భక్తిశ్రద్ధలతో దర్శనం చేసుకుంది. అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే.. ఆమె అక్కడ స్వయంగా 'సేవ'లో పాల్గొంది. ఆలయ ప్రాంగణంలో నేలపై కూర్చుని భక్తులు భోజనం చేసిన గిన్నెలను (పాత్రలను) కడుగుతూ కనిపించింది.

ఒక స్టార్ హీరోయిన్ అయి ఉం...