భారతదేశం, జూలై 25 -- Pralhad Joshi: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం మరియు జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఉద్ధృత పోరాటం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేసిన రాజీనామాకు రాష్ట్రపతి ఆమోద ముద్ర పడింది. ధర్మేంద్ర ప్రధాన్ సమర్పించిన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదన మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు

ధర్మేంద్ర ప్రధాన్ తప్పుకోవడంతో ఖాళీ అయిన విద్యాశాఖ బాధ్యతలను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి (Pralhad Joshi) కి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి ప్రస్తుతం కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖలతో పాటు నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ...