భారతదేశం, ఏప్రిల్ 19 -- Prakash Raj: ప్రకాష్ రాజ్ ఇటీవల రామాయణంపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలో ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తన వివరణ ఇచ్చాడు. తన మాటలను వక్రీకరించారని పేర్కొన్నాడు. ఎక్స్ లో ఓ వీడియో పోస్టు చేశాడు.

రామాయణంపై తాను చేసిన వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చాడు. ''ఒక సాహిత్య కార్యక్రమంలో పాల్గొన్నా. అక్కడ నా ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని వక్రీకరించారు. నేనేదే అవతార పురుషుడు శ్రీరాముడిని ఎగతాళి చేశానని, హిందూ ధర్మాన్ని హర్ట్ చేసేలా మాట్లాడానని అంటున్నారు'' అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చాడు.

''అన్ని ధర్మాలను, అందరిని ప్రేమించే నాకు ఆ అవసరం లేదు. ధర్మాన్ని మతోన్మాదంతో అడ్డుపెట్టుకుని అసహ్యమైన రాజకీయాలు చేసేవాళ్లు నేను అడిగే ప్రశ్నలకు సమాధానాలు లేక నన్ను యాంటీ హిందు,...