భారతదేశం, జూలై 3 -- Prakash Raj: ఏపీ పాలిటిక్స్ లో మరోసారి పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ నేరుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, జనసేన పార్టీ కార్యకర్తలను టార్గెట్ చేస్తూ పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్న ఆయన.. జనసైనికుల దాడుల గురించి కూడా కొన్ని ప్రశ్నలు సంధించారు.

ఎప్పుడూ తన ఐకానిక్ హ్యాష్ ట్యాగ్ #justasking తో పొలిటికల్ లీడర్స్ ను ఇరుకున పెట్టే ప్రకాష్ రాజ్.. ఈసారి పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ పాయింట్ ను టచ్ చేస్తూ ఒక ఘాటైన ట్వీట్ చేశారు.

తన మొదటి ట్వీట్ లో ప్రకాష్ రాజ్ పోలీసు వ్యవస్థ గురించి చాలా తీవ్రమైన కామెంట్స్ చేశారు. "పోలీస్ డిపార్ట్‌మెంట్ లో ఎన్నో ఏళ్లు సేవలు అందించిన మీ నాన్నగారి మీద ఉన్న గౌరవంతో అయినా ఆలోచించండి. మీకు ఒక ...