భారతదేశం, జూలై 21 -- Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఢిల్లీ వీధుల్లోకి దిగి కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP), విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసనకు మద్దతుగా ఆయన జంతర్ మంతర్ వద్ద సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరో స్వాతంత్య్ర పోరాటం లాంటి ఉద్యమం మొదలైందంటూ ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి.

జులై 20న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన 'చలో సంసద్' మార్చ్‌ లో ప్రకాష్ రాజ్ ప్రత్యక్షంగా పాల్గొన్నారు. అంతకుముందు జూన్‌లో బెంగళూరులో జరిగిన నిరసనలో కూడా పాల్గొన్న ఆయన.. నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన వీడియో మోంటేజ్‌ను తన ఎక్స్ ఖాతాలో ష...