భారతదేశం, ఆగస్టు 14 -- Prabhas Instagram DP: పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ సోషల్ మీడియాలో సరికొత్త సంచలనం సృష్టించారు. దాదాపు ఏడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్ డిస్‌ప్లే పిక్చర్ (DP)ను మారుస్తూ ఫ్యాన్స్‌కు ఓ మంచి సర్‌ప్రైజ్ ఇచ్చారు. తన రాబోయే పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ' (Fauzi) ఫస్ట్ లుక్ పోస్టర్‌ను డీపీగా సెట్ చేయడంతో నెట్టింట ఒక్కసారిగా పూనకాలు మొదలయ్యాయి.

సాధారణంగా సోషల్ మీడియాలో ప్రభాస్ చాలా తక్కువగా యాక్టివ్‌గా ఉంటారు. తోటి నటీనటుల సినిమాలకు శుభాకాంక్షలు చెప్పడం లేదా తన ప్రాజెక్ట్‌లకు సంబంధించిన అఫీషియల్ అప్‌డేట్స్ ఇవ్వడం తప్ప పర్సనల్ పోస్టులు పెద్దగా పెట్టరు.

గతంలో 'సాహో' సినిమా టైమ్‌లో పెట్టిన ప్రొఫైల్ పిక్చర్‌నే ఇప్పటివరకు కొనసాగించిన ప్రభాస్.. ఇప్పుడు 'ఫౌజీ' ఫస్ట్ లుక్ పోస్టర్‌తో దాన్ని అప్‌డేట్ చేశారు. ఏడ...