భారతదేశం, ఆగస్టు 30 -- దీర్ఘకాలిక లక్ష్యాల కోసం డబ్బు దాచుకోవాలనుకునే ప్రతి ఒక్కరి మనసులో మొదట మెదిలే ప్రశ్నలు.. "మన డబ్బు సురక్షితంగా ఉంటుందా?", "ఎంత రాబడి వస్తుంది?". ఇదే విషయాన్ని ఇద్దరు స్నేహితులు రీమా, సీమా ఉదాహరణతో అర్థం చేసుకుందాము. ఇద్దరు కూడా.. వచ్చే 15 ఏళ్లలో పెద్ద మొత్తంలో కార్పస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం నెలకు రూ. 10,000 చొప్పున కేటాయించడానికి సిద్ధపడ్డారు.

అయితే రీమా పూర్తిగా ప్రభుత్వ భద్రత ఉన్న పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)ను ఎంచుకోగా, సీమా కాస్త ముందుకు వెళ్లి నిర్భయంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్) మార్గాన్ని ఎంచుకుంది. 15 ఏళ్లు ముగిసేసరికి ఎవరి చేతిలో ఎక్కువ డబ్బు ఉంటుంది? నిపుణుల లెక్కలు ఏం చెబుతున్నాయో విశ్లేషిద్దాము.

రీమా ఎంచుకున్న పీపీఎఫ్ ఖాతాలో నెలకు ...