భారతదేశం, మే 13 -- Pooja Hegde: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ వద్ద ఒక సెన్సేషన్. ఇప్పటికే 'డీజే' (దువ్వాడ జగన్నాథమ్), 'అల వైకుంఠపురములో' వంటి బ్లాక్‌బస్టర్ హిట్లతో మెప్పించిన ఈ జోడీ.. ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ తన 23వ చిత్రాన్ని (AA23) చేయబోతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌లో కథానాయికగా పూజా హెగ్డేను ఎంపిక చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు సమాచారం.

ఈ మేరకు ఇప్పటికే ఆమెతో ప్రాథమిక చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. లోకేష్ మార్క్ యాక్షన్, బన్నీ స్టైల్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయ...