భారతదేశం, ఏప్రిల్ 12 -- రోడ్డు ప్రమాద బాధితులందరికీ తక్షణమే ఉచిత వైద్య చికిత్సను అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన PM RAHAT(Prime Minister's Road Accident Victims' Hospitalisation & Assured Treatment) పథకం, త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి రానుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ తెలిపారు.

రోడ్డు ప్రమాద బాధితులకు 'గోల్డెన్ అవర్' (ప్రమాదం జరిగిన వెంటనే ఉండే అత్యంత కీలక సమయం)లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ద్వారా 687 ప్రైవేట్, 17 ప్రభుత్వ నెట్‌వర్క్ ఆసుపత్రులలో రూ. 1.5 లక్షల విలువైన వైద్య సేవలు అందించనున్నట్టుగా మంత్రి పేర్కొన్నారు.

ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేసేందుకు గాను, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. ప్రతి నెట్‌వర్క్ ఆసుపత్రి కూడా రోడ్డు ప్రమాద బాధితు...