భారతదేశం, ఏప్రిల్ 27 -- PM Modi Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. మే రెండో వారంలో ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని సమాచారం.

సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఈ భారీ బహిరంగ సభకు వేదిక కానుంది. ఈ వేదిక నుంచే ప్రధాని తన ప్రసంగం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు... ఇటు తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు, భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

పరేడ్ గ్రౌండ్స్ సభ నుంచే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజె...