భారతదేశం, మార్చి 10 -- తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు భారీ ఊరట దక్కింది. సుప్రీంకోర్టు ప్రభాకర్‌ రావుకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అధికారుల విచారణకు పూర్తిగా సహకరించాలని ప్రభాకర్ రావును అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

ప్రభాకర్ రావుకు గతంలో ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను రెగ్యులర్ బెయిల్‌గా జస్టిస్ నాగరత్న ధర్మసనం మార్చింది. కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకరించాలని, నిందితుడు ప్రభాకర్ రావుకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. అంతేకాకుండా.. ప్రభాకర్ రావు తన పాస్‌పోర్ట్‌ను సరెండర్ చేయాలని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. సాక్షులను, ఆధారాలను ప్రభావితం చేయెుద్దని ఆదేశాలు జారీ చేసింది. రూ.35 వేల పూచీకత్తు, ఇద్దరు వ్యక్తుల షూరిటీతో ప్రభాకర్ రావుకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు ముందస్తు...